Search
Close this search box.
Search
Close this search box.

గుమ్మలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం 50 రోజులు పూర్తి

గుమ్మలూరు

          ఆచంట ( జనస్వరం ) : నియోజకవర్గంలోని గుమ్మలూరు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేద్రం 50 పూర్తి చేసుకున్న సందర్భంగా కొణిదల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర టీం పడికిలి పోస్టర్ ను గుమ్మలూరు జనసేన నాయకులు  కొప్పినీడి శ్రీనివాసరావు, గుమ్మలూరు జనసేనపార్టీ వార్డ్ మెంబెర్, శ్రీమతి దార్లంక ధనలక్ష్మి  మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి రావి హరీష్ బాబు గారు విడుదల చేసారు. ఈ సందర్భంగా రావి హరీష్ బాబు మాట్లాడుతూ గుమ్మాలురులో చలివేద్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2020లో కూడా నిర్వహించడం జరిగింది . 2021 లో కరోనా కారణంగా నిర్వహించలేకపోయామని అన్నారు.  మరల ఈ సంవత్సరం గత నెల 10వ తేదీన ప్రారంభించడం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ రోజుకి 50 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంత విజయవంతంగా చలివేంద్రం రన్ కావడానికి ముఖ్యలు కొప్పినీడి శ్రీనివాసరావు ప్రోత్సహం ఇచ్చారన్నారు. మజ్జిగ దాతలుగా తమంతా తామే వచ్చి ఈరోజు మజ్జిగ మేము పెట్టుకుంటామని వచ్చిన ప్రతి దాతకు గుమ్మలూరు జనసేన పార్టీ గుంమలూరు జనసైనికులు తరుపున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు తేజ, అంజనీ ప్రసాద్, విజయ్, రాంబాబు, మధు, సాలెం,వంశీ బన్నీ, బాలు, బాబీ మరియు లారెన్స్ మొదలగువారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way