బెళుగుప్ప మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    బెళుగుప్ప, (జనస్వరం) : అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రమును బెళుగుప్ప డిప్యూటీ తహసీల్దార్ పీరా ప్రారంభించారు. ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం బెళుగుప్ప మండల అధ్యక్షులు కాసంశెట్టి సుధీర్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని గుర్తుంచుకుని ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలను ప్రజలకు అందించడమే జనసేన లక్ష్యం అని చెప్పారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ సభ్యులు అజయ్, నాని, తిప్పయ్య, ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way