ప్రజాపోరాట యాత్రలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు సిజి రాజశేఖర్

      పత్తికొండ, (జనస్వరం) : పత్తికొండ నియోజకవర్గం, క్రిష్ణగిరి మండలం, టీ గోగులపాడు గ్రామంలో మండల నాయకులు నాగేశ్వరరావు, తిరుపాల్, ఖలీల్, ఆధ్వర్యంలో పర్యటించారు. అనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ టీ గోగులపాడు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా ఉంది. మేము ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు మాకు తెలుపుతున్న విషయాలు ఏమిటంటే, ఈ డ్రైనేజీ వ్యవస్థ బాగా లేకపోవడం వల్ల కొన్నిచోట్ల సిసి రోడ్లు లేక మురికి నీరు నుండి రోడ్లపై నిలిచిన దృశ్యాలు చూశానని అన్నారు. మురికి నీరు రోడ్లపై నిలచడం వల్ల గ్రామ ప్రజలకు డెంగ్యూ మలేరియా వంటి విశ్వజరాలు వస్తున్నాయని, బ్లీచింగ్ పౌడర్ కూడా మా గ్రామంలో సరిగా చల్లడం లేదని, కొన్నిచోట్ల డ్రైనేజీ కాలువలు ఉన్నప్పటికీ ఆ డ్రైనేజీ కాలువలు కూడా నిండిపోయిన పట్టించుకోని అధికారులు, అలాగే త్రాగే నీటిలో పురుగులు వస్తున్నాయని కొంతమంది వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మీరు మా సమస్యలను మీ పార్టీ తరఫున అధికారులపై ఒత్తిడి పెంచి మాకు మంచి సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తుల కోరారని తెలిపారు. గ్రామం మొత్తం పర్యటించిన తర్వాత గ్రామ సచివాలయానికి వెళ్లి గ్రామస్తులు చెప్పిన సమస్యలపై పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడడం జరిగింది. పై అధికారులైనా ఎంపీడీవోకి ఫోన్ ద్వారా సమస్యలు వివరించడం జరిగింది. వెంటనే పరిష్కరించాలని లేదంటే జనసేనపార్టీ తరపున ఏం చేయాలో నేను చేసి చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేనపార్టీ నాయకులు సౌకత్, నరసింహుడు, రాముడు, షేక్షావలి, శ్రీకాంత్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way