టిడిపి పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ శ్యాంబాబుకు మద్దతు తెలిపిన CG రాజశేఖర్

పత్తికొండ

       పత్తికొండ ( జనస్వరం ) : టిడిపి పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జ్ శ్యాంబాబు వారికి జనసేనపార్టీ తరఫున సంఘీభావం ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు CG రాజశేఖర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న మేము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా సీఎంగా వ్యవహరించినటువంటి చంద్రబాబు గారిని గవర్నర్ పర్మిషన్ లేకుండా అక్రమ అరెస్టుపై ఖండించడం జరిగినది. వైయస్ జగన్ రెడ్డి 31 కేసులలో A1 ముద్దాయిగా ఉన్నప్పటికీ వాయిదాలకు హాజరు కాకుండా పదవిని అడ్డుపెట్టుకొని బెయిల్ పై తిరుగుతున్నటువంటి జగన్ రెడ్డి రాబోవు కాలంలో కచ్చితంగా జైలు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించడం జరిగినది. 2024లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, పొత్తులో భాగంగా అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, జయరాముడు, గద్దల రాజు ,కంబగిరి, గద్దరాజు, చిరంజీవి, గల్లా రామచంద్ర, ఇస్మాయిల్ ,అజయ్ ,మనోహర్, అనిల్, వడ్డీ వీరేష్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way