
హైదరాబాదు (జనస్వరం) : చిన్నారుల పైన జరుగుతున్నా దాడులకి నిరసనగా కూకట్ పల్లి నియోజకవర్గం లోని మూసాపేట్ 117 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు నాగేంద్ర ఆధ్వర్యంలో కొవ్వూత్తుల ప్రదర్శన మరియు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి బస్తీలో దారుణ హత్యకి గురైన ఆరేళ్ళ చిన్నారి చైత్రకి న్యాయం చెయ్యాలని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. నాగేంద్ర గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చిన అక్కడ జనసేన పార్టీ ఉంటది అని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబనికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటది అని చెప్పడం జరిగింది. ఈ నిరసనలో N. నాగేంద్ర (మూసాపేట్ డివిజన్ అధ్యక్షులు), V. రాము, P. గోవర్ధన్, సుదర్శన్, తేజ, ద్రాక్షయని, ముంతాజ్ వెంకటేశ్వరావు, చంటి, సురేష్, సాయి, మురళి, కిరణ్, రాజా, అంజి, వైకుంఠరావు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.