సీఎం జగన్ రెడ్డికి కులపిచ్చి లేదని ఎవరైనా కాదనగలరా? రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్

సీఎం జగన్ రెడ్డికి కులపిచ్చి లేదని ఎవరైనా కాదనగలరా?
– క్రిస్టియన్స్ ని ఓటు బ్యాంకు వాడుకుంటూ నామినేటెడ్ పదవుల్లో వారికి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా?
– నామినేటెడ్ పదవుల్లో వెయ్యికిపైగా పదవులు వారి సామాజిక వర్గానికి కేటాయించడాన్ని కులపిచ్చి అంటారా సామాజిక న్యాయం అంటారా?
– సామాజిక న్యాయం పేరుతో తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటున్న సీఎం జగన్
– ఈ మధ్య కొంతమందికి అనారోగ్యం వచ్చి ఆపరేషన్ చేయించుకుని మతిస్థిమితం సరిగా లేదనుకుంటా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు నోరు అదుపులో పెట్టుకోవాలి?
– రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్
       విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి మతిస్థిమితం తప్పిందని అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, దమ్ముంటే సీఎం జగన్ రెడ్డికి కులపిచ్చి లేదని నిరూపించాలన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు గాని ఇతర ముఖ్యమైన పదవులు అన్నీకూడా జగన్ వారి సామాజిక వర్గం నుంచే భర్తీ చేశారని తెలిపారు. వెయ్యికి పైగా తన సామాజిక వర్గం వారికి కట్టబెట్టారని అందుకు సంబంధించిన వివరాలన్నీ పోసాని కూడా పంపిస్తామని అప్పుడు వారు జగన్ కి అని బహిరంగంగా ప్రకటించాలన్నారు. క్రిస్టియన్స్ ని ఓటు బ్యాంకు వాడుకుంటూ నామినేటెడ్ పదవుల్లో వారికి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. నామినేటెడ్ పదవుల్లో వెయ్యికిపైగా పదవులు వారి సామాజిక వర్గానికి కేటాయించడాన్ని కులపిచ్చి అంటారా… సామాజిక న్యాయం అంటారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం పేరుతో తన సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటున్న సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. ఈ మధ్య కొంతమందికి అనారోగ్యం వచ్చి ఆపరేషన్ చేయించుకుని మతిస్థిమితం సరిగా లేదనుకుంటా అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way