కోవెలకుంట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

    కోవెలకుంట్ల, (జనస్వరం) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కోవెలకుంట్లలోని సంత మార్కెట్ లో డొక్కా సీతమ్మ గారి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు పత్తి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి సురేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించినప్పటినుండి పవన్ కళ్యాణ్ గారి సామాజిక సేవల స్ఫూర్తితో ఇసుక కొరతతో ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం, చలికాలంలో చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న పేదలకు దుప్పట్ల పంపిణీ, కరోనా సమయంలో విలేకరులకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం కోసం తమ వంతు సహాయంగా నేడు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గురప్ప, బోధనం ఓబులేసు, చెన్న కిట్టు,లింగమయ్య, పొట్టిపాడు భాష, సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పత్తి సురేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way