Logo
Date of Publish : 25 October 2022, 3:08 pm
Editor : Sake Naresh

బలివే గ్రామంలో తమ్మిలేరు మీద బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి : నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబు

          నూజివీడు, (జనస్వరం) : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో ముసునూరు మండల పరిధిలోని బలివే గ్రామంలో ఎన్నో ఏళ్ల నుండి తమ్మిలేరు నది మీద ప్రయాణికులకు, ఇతర ప్రాంతాల నుండి బలివే రామస్వామి వారి క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు గురికావడం, అలానే ప్రధాన రహదారికి విద్యార్థులు, ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నిత్యం అదే ప్రవాహం దాటి వెళ్తున్న సందర్భంలో గతంలో గ్రామస్తులు అనేక సార్లు ఈ సమస్య గురించి అధికారులకు ప్రజా ప్రతినిధులకు అర్జీలు పెట్టిన పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియా మీద పెట్టే శ్రద్ద ప్రజల సమస్యల మీద పెట్టాలని ముసునూరు ఎంపిడివోకి నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు అధ్వర్యంలో బలివే గ్రామ యువతతో కలిసి స్థానిక నాయకులతో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు చేబత్తిన విజయ్, గిరి గోపికృష్ణ, యాదల మహేంద్ర, రాము, చేకూరి అనిల్, బయ్యం సతీష్, రాజబోయిన సుబ్బు యాదవ్, కేశవ, యలబాక నరసింహ తదితరుల పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com