Search
Close this search box.
Search
Close this search box.

బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్

బ్లాక్ ఫంగస్

                    గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన జనసేన కార్యకర్త విష్ణు మొలకల నాగరాజు గత కొంతకాలంగా కరోనా తో బాధపడుతూ జనసేన పార్టీ PAC చైర్మైన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సహాయంతో విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  నాగరాజు చికిత్స కోసం ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా సోకినది. చికిత్సకు ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుండడంతో స్పందించిన స్థానిక జనసేన నాయకులు బొలియశెట్టి శ్రీకాంత్ గారు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న జనసేన కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, నాగరాజుకు తన వంతు సహాయం రూ. 10 వేల  అందించానని, మరికొంత మంది దాతలు అతనికి ఆర్థికంగా సహాయం చేసి అతని ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way