బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమం

బొబ్బేపల్లి సురేష్

         సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలోని చిన్న చెరుకూరు పంచాయతీలో రెండవ రోజు జనం కోసం జనసేన కార్యక్రమాన్ని కొనసాగించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. సురేష్ నాయుడు మాట్లాడుతూ చిన్న చెరుకూరు పంచాయతీ అరుంధతి వాడలో ప్రజలు వీధి లైట్లు లేక, సైడ్ కాలువలు పరిశుభ్రపరచకపోవడం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంది. అదేవిధంగా పేదలకు ఇస్తామన్న ఇళ్ల పట్టాలు ఇప్పటివరకు ఇవ్వకపోవడం బాధాకరం. వాళ్ళ దగ్గర ఉన్న కాస్త కూస్తో డబ్బులతో ఇళ్లు అయితే కొంతవరకు నిర్మాణం చేసుకున్నారు. పూర్తిస్థాయిలో నిర్మాణం కావాలంటే డబ్బు కావాలి ప్రభుత్వమే వారిని ఆదుకోవాలి. కానీ ప్రభుత్వం పేదలకు ఇస్తానన్న ఇళ్ల పట్టాలు ఎందుకని ఇవ్వకుండా దాగుడుమూతలు ఆడుతుంది. ఎందుకని మంత్రి ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పించడం లేదు. త్వరితగతిన వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే జనసేన పార్టీ వాళ్లకి అండగా నిలబడి, వాళ్లకి ఇళ్ల పట్టాలు ఇచెంతవరకు పోరాడుతాం. అదేవిధంగా వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. మురుగు కాలువల్లో బ్లీచింగ్ కొట్టించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో జనసేన ఆధ్వర్యంలో మేమే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ప్రసాద్, సుబ్రహ్మణ్యం, సాయి, శ్రీహరి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం భాయ్, అగ్బర్, చిన్న తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way