తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం జనసేన పార్టీ, జీల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది పిల్లలు తలసేమియా వ్యాధి తో బాధ పడుతున్నారని ప్రభుత్వం ఇచ్చే సాయం వాళ్లకు ఏ మాత్రం సరిపోవడం లేదని అందువల్ల తమ సంస్థ 30 మంది తలసీమియా వ్యాధిగ్రాస్థ పిల్లలను దత్తత తీసుకోవడం జరిగిందిని వారికి సకాలంలో రక్తం అందించడం జరుగుతుందని జీల్ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ సత్యసాయి తెలిపారు. ఈ రోజు జరిగిన రక్తదాన శిబిరం లో పవన్ పుత్ర బ్లడ్ డోనర్స్, ప్రాణ దాత ఫౌండేషన్, జనసేన నాయకులు సహకారంతో 100 మంది యువకులు పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల మండల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు సయ్యద్ విశ్వక్ సేన్, జనసైనికులు కాకర్ల. బాబాజీ,నిఖిల్ జీల్ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ సత్య సాయి, సాయి, శేఖర్, వంశీ, కీర్తి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.