
నర్సీపట్నం, (జనస్వరం) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తి అంజనా దేవి గారి జన్మదిన సందర్భంగా నర్సీపట్నంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంజనా దేవి గారు జన్మదిన సందర్భంగా నర్సీపట్నంలో “అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్” వారి ఆధ్వర్యంలో నర్సీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రాజన్న వీర సూర్య చంద్ర మరియు సేవా ట్రస్ట్ అధ్యక్షులు పెను పోతుల నాగు గారి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజ కార్యక్రమం, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పండ్లు, బ్రెడ్ ఏరియా హాస్పిటల్ డాక్టర్ ల పర్యవేక్షణలో పంపిణీ చేశారు. తదుపరి పెద్ద బొడ్డేపల్లిలో ఉన్నటువంటి నిరాశ్రయుల ఆశ్రమంలో ఉన్నటువంటి నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు పంపిణీ, M.P.P స్కూల్ లో పుస్తకాలు, పెన్ లు పంపిణీ చేయడం జరిగింది.