నిరుద్యోగ సమస్యల కొరకు నిరాహార దీక్ష చేపట్టిన భగత్ సింగ్ (జనసేన )విద్యార్థి విభాగం (SKU)

                ఈ రోజు యస్ కే యూనివర్సిటీ లో ఏఐయస్ఏ (AISA) ఆధ్వర్యంలో చేపడుతున్న నిరుద్యోగ సమస్యల కొరకు నిరాహార దీక్షకు భగత్ సింగ్ (జనసేన) విద్యార్థి విభాగం మద్దతు ఇవ్వడం జరిగింది. భగత్ సింగ్ విద్యార్థి విభాగం అధ్యక్షులు జయంత్ వర్ధన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో భగత్ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు నవీన్, గణేష్ పాల్గొని మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్, గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో టీచర్ పోస్టులు 25 వేలు, కానిస్టేబుల్ పోస్టులు 16 వేలు, లైబ్రరీ సైన్స్ పోస్టులు 6 వేలు, సచివాలయం లో 8 వేలు కాళిగా వున్న రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనక పోవడం పై నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు అని అన్నారు. వీటిని కూడా కలిపి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1,2 కలిపి కేవలం 36 పేర్కొన్నారని, వేళల్లో ఖాళీగా వున్న పోస్టులు పేర్కొనలేదు. గ్రూప్ 3,4 పోస్టులు పేర్కొనలేదు అని, ప్రభుత్వం ఈ క్యాలెండర్ ని  రద్దు చేసి వెంటనే కొత్త క్యాలెండర్ నీ విడుదల  చేయాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో భగత్ సింగ్ విద్యార్థి విభాగం మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.