Search
Close this search box.
Search
Close this search box.

లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరిన బంగారురాజుపేట గ్రామస్తులు

     విజయనగరం, (జనస్వరం) : డెంకాడ మండలం, బంగారురాజుపేట గ్రామంలో లోకం మాధవి  ఆధ్వర్యంలో ఇంటింటికీ జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాధవి ప్రతి గడపకి పర్యటిస్తూ ఈ దుష్ట పాలన పోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలియజేయాలని ప్రజలను కోరారు. ముఖ్యంగా బంగారురాజుపేట గ్రామంలో పారిశుద్ధ్యం, రోడ్లు , మరియు వీధి దీపాల పరిస్తితి ఎంతో దయనీ స్థితిలో ఉంది గ్రామ ప్రజలు నాయకులు పై విసిగిత్తిపోయి, జనసేన వైపు చూస్తున్నారు. ప్రస్తుత పాలనతో విసిగిపోయి జనసేన పార్టీ రావాలి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి మరియు ప్రజలకు మంచి జరగాలి పేదోడికి న్యాయం జరగాలి అని బంగారురాజుపేట లో సుమారు 60 కుటుంబాల నుంచి గ్రామప్రజలు లోకం మాధవి గారి ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకొని జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పైలశంకర్ కోరాడ అప్పారావు, వీర మహిళ అట్టాడ ప్రమీల జ్యోతి కోన శివ పాండ్రంకి మహేష్ ఉపేంద్ర మరియు గ్రామ నాయకులైన అప్పల రెడ్డి వీరబాబు శ్రీను లక్ష్మణ్ మోహన్ పవన్ రాజు నవీన్ రెడ్డి ఆది రాము మహేష్ నరేష్ సాయి లోకేష్ వరుణ్ హరీష్ మరియు శ్రీను పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way