రోడ్డుకు మరమ్మతులు చేయాలని R&B అధికారులకు వినతి పత్రం ఇచ్చిన బనగానపల్లె జనసేన నాయకులు

    బనగానపల్లె, (జనస్వరం) : బనగానపల్లె మండలంలోని బనగానపల్లె నుండి గుత్తికి వెళ్లే మార్గంలో దద్దనాల ప్రాజెక్టు నుండి చిన్న రాజుపాలెం వరకు అలాగే యనకండ్ల గ్రామం నుండి బత్తులూరుపాడు గ్రామం వరకు రోడ్డు గుంతలమయమై అధ్వాన్నంగా తయారయింది అని జనసేన పార్టీ నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం R&B అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ రోడ్లు గుంతలమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుందని, బనగానపల్లె నుండి గుత్తి వెళ్లే మార్గంలో డబల్ రోడ్డు దద్దనాల ప్రాజెక్ట్ నుండి చిన్నరాజుపాలెం వరకు మాత్రం సింగల్ రోడ్డుగానే ఉందని, దాన్ని డబుల్ రోడ్డుగా మార్చాలని త్వరగా టెండర్లు పిలిచి రోడ్డుకు మరమ్మతులు చేపించాలని అధికారులకు జనసేన పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసైనికులు అజిత్ రెడ్డి, జనార్ధన్, సుధీర్ రెడ్డి, చిన్న, చరణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook