Search
Close this search box.
Search
Close this search box.

రాష్ట్రమంతటా బాదుడే.. బాదుడు

పవన్‌ కల్యాణ్‌, జనసేన

● ఏప్రిల్‌ 1న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన
● ఒక అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం
● అన్నింటిపై ‘‘బాదుడే – బాదుడు’’ అంటూ సాగుతున్న పాలన
● ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలకు షాక్‌ ఇచ్చిన ప్రభుత్వం
● ఎన్నికల ప్రచారంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ హామీ ఏమైంది..?
● విద్యుత్‌ చార్జీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు పోరాటం చేస్తాం
● పథకాల పేరుతో ఒక చేత్తో రూ.10 ఇచ్చి… ఇంకో చేత్తో రూ.20 వసూలు
● రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలపై స్పందించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
       అమరావతి, (జనస్వరం) : ఒక్కసారి పవర్‌ ఇవ్వండి నా పవర్‌ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్‌ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్‌ ఈ విధంగా చూపించుకుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ గురువారం తీవ్రంగా విమర్శించారు. ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్‌ ఛార్జీల వడ్డింపుతోపాటు ట్రూ అప్‌ ఛార్జీల పేరిట మరో రూ. 3వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. ఆదాయం లేదు… రాబడి లేదు… ట్యాక్సుల మీద ట్యాక్సులు మాత్రం వేస్తున్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్‌పై అధిక వ్యాట్‌, లిక్కర్‌పై అయితే సరే సరే. ఇప్పుడు విద్యుత్‌ ఛార్జీలు కూడా పెంచి సామాన్యుడి వెన్ను విరిచేస్తున్నారు. సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో రూ. 20 లాక్కుంటున్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీ ఏమైంది?
పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఫ్రీ అని హామీ ఇచ్చిన జగన్‌ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటను మరిచిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉన్న మనం… ఇవాళ అప్రకటిత విద్యుత్‌ కోతలతో అల్లాడిపోతున్నామన్నారు. గ్రామాల్లో 3 నుంచి 6 గంటల వరకు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీటి పన్ను, ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై బాదుడే బాదుడు అని మాట్లాడిన మీరే… ఈ రోజు విద్యుత్‌ ఛార్జీలు పెంచితే దీనిపై ఏం మాట్లాడాలి? బాదుడే బాదుడు అనాలా? ఇంకేం అనాలో మీరే చెప్పండి. ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు తెల్లారిందంటే చాలు… జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుందో, ఏ ఛార్జీలు పెంచుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. పెంచిన విద్యుత్‌ ఛార్జీలకు నిరసనగా అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల ముందు జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుందన్నారు. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఉపసంహరించుకోవాలంటూ వినతిపత్రాలు అందజేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way