Logo
Date of Publish : 07 August 2021, 1:19 pm
Editor : Sake Naresh

మహిళ లపై దాడులని అరికట్టాలి : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి రాయపాటి అరుణ

     ప్రకాశం ( జనస్వరం ) : ఒంగోలులో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి రాయపాటి అరుణ గారు మీడియాతో మాట్లాడుతూ మహిళల పై రోజురోజుకి దాడులు పెరిగిపోతున్నాయి అని, ప్రతి రోజు రాష్టంలో ఏదో ఒక చోట మహిళలు హింసకి గురవుతున్నారు అని అన్నారు. చట్టంలో ఉన్న లోపాలు ఆసరాగా చేసుకొని దూర్మార్గులు ఇలాంటి దాడులకి పాల్పడుతున్నారు. చట్టాలు రూపొందించటమే కానీ అమలు చేయటంలో ప్రభుత్వం విఫలం అవుతుంది అని ప్రచార అర్భాటమే కానీ దిశ చట్టం ఎక్కడా సరైన రీతిలో అమలు జరగటం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన, మహిళలు, బాలికలు అత్యాచారాలు హత్యలు, శారీరక దాడులకి గురి అవుతున్నారు అని అందుకు ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్లో నర్స్ మీద జరిగిన దాడి ఒక ఉదాహరణ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బాధితుల పట్ల అండగా నిలిచి నిందితులకు త్వరిత గతిన శిక్ష పడేలా చేయాలన్నారు. మహిళలపై ప్రతిచోట ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అనీ జనసేన తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలియచేసారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించని యెడల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు రియాజ్ గారి సారథ్యంలో ఉద్యమిస్తామని తెలియచేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com