Search
Close this search box.
Search
Close this search box.

పాత్రికేయులపై దాడులు సమర్థనీయం కాదు : జనసేన నాయకురాలు దారం అనిత

     మదనపల్లి,(జనస్వరం) : రాష్ట్రంలో పాత్రికేయులపైన దాడులు రోజురోజుకు పెరిగిపోయాయని, మదనపల్లిలో విలేఖరి వెంకశివపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్‌ చేశారు. వైసిపి భూకబ్జాదారుల దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటశివ చికిత్స పొందుతున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం వచ్చిన తరువాత రాష్టంలో పత్రికలపైన, పాత్రికేయలపైన దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయంగా వార్తలు రాసే వెంకట శివపై వైసిపి నాయకుల దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. వైసిపి నాయకులు చేసే భూ కబ్జాలపై వార్త రాసిన వెంకట శివపై దాడి చేసిన వెంకటేశ్వర రెడ్డి, మహేశ్వర రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ‌కేసు నమోదు చేయని పక్షంలో జనసేన తరుఫున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way