నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలం దువ్వూరు గ్రామం చెందిన జనసైనికులు గంగపట్నం శ్రీనివాసులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసినదే. కీర్తిశేషులు శ్రీనివాసులు భార్య సుదీప గారికి, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అలాగే ప్రస్తుత విపత్కర సమయంలో జనసైనికులు కూడా బయటకు రావోద్దని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, అలాగే శానిటైజర్ కూడా నిత్యం వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మరియు సంగం మండల ప్రధాన కార్యదర్శి దాడి భాను కిరణ్, సుబ్రహ్మణ్యం, శ్రీహరి, ప్రవీణ్, రాకేష్, తిరుమలేష్, ప్రవీణ్, శ్రీనివాసులు, హరిబాబు, సుధాకర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com