Search
Close this search box.
Search
Close this search box.

వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆత్మకూరు ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

     ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, జనసైనికులతో కలిసి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాల కారణంగా వరి, వేరుశనగ, పత్తి పంటలకు మరియు ఆక్వా రైతులకు అపారమైన నష్టం వాటిల్లిందని, వెంటనే అధికారులు స్పందించి నష్టాలను అంచనా వేసి, నష్టపరిహారం ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా గత మూడు సంవత్సరాలుగా వచ్చిన వరదల కారణంగా మరియు గతంలో నివార్, ప్రస్తుత అశని తుఫానుల కారణంగా గత మూడు సంవత్సరాల నుండి రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారని, ఇది రైతులను ఆర్థికంగా కోలుకొని దెబ్బతీసిందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల నుండి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని, ఈ సంవత్సరమైనా దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way