కురవ సంఘ ఆత్మీయ సమావేశంకు ముఖ్య అతిధిగా అతికారి దినేష్

  రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్  సహకారంతో సుండుపల్లి మండల కురవ సంఘం అధ్యక్షులు జయరాం ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల నాయకులు జగిలి ఓబులేష్  అధ్యక్షతన టి, సుండుపల్లి మండలంలో కురువ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ పాల్గొన్నారు.  బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ గారు వారి కష్టాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దినేష్ మాట్లాడుతూ నేను సిద్ధం అంటున్న జగన్ మీ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏమీ లేదని బీసీ సంక్షేమం కోసం ఏనాడైనా ఆలోచించారా అని అన్నారు.  బీసీ లోని అన్యాయం చేసిన చరిత్ర నీది అన్న విషయం గుర్తు పెట్టుకో జగన్ నిన్ను రాజంపేట ఎమ్మెల్యేని ఇంటికి సాగనంపడానికి రాజంపేట నియోజకవర్గ బీసీలు మరియు ప్రజలు కూడా మేము సిద్ధం అంటున్నారు అని అన్నారు.  కురవ సంఘాలకు బీసీలోని అన్ని ఉపకులాల వారికి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని వారి సమస్యలను అన్ని విధాలుగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way