ప్రస్తుతం వైకాపా శ్రేణులు చేపట్టింది "ప్రజా సంకల్ప యాత్ర" కాదు.. ప్రజా నయవంచన యాత్ర : జనసేన నాయకులు బి సి నాగరాజు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ లోని ఇండోర్ స్టేడియంలో ఎమ్మిగనూరు తాలుకా జనసేన పార్టీ నాయకులు బి సి నాగరాజు పత్రిక విలేకరులతో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తను చేపట్టిన "ప్రజా సంకల్ప యాత్ర" ముగిసి నేటికీ మూడు సంవత్సరాలు అవుతున్నా సందర్భంగా నేడు ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు ఎంతో అత్యుత్సాహంతో, హంగు, ఆర్భాటంతో చేపట్టిన ఈ "ప్రజా సంకల్ప యాత్ర" లో చిత్తశుద్ధి లేదని ఇది "ప్రజా నయవంచన యాత్ర" అని పేర్కొన్నారు. ఈ ప్రజా పాలక పక్షం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ప్రజా సంక్షేమానికి కృషి చేయలేదని, కనీసం రైతులకు మద్దతు ధర కూడా ఇదివరకు ప్రకటించలేదు. కార్పొరేషన్ల నుండి ఇది వరకు రుణాలు కూడా అందించలేదని, నిరుద్యోగ యువతకు ఇదివరకు ఉపాధి కూడా చూపించలేదని, ఎక్కడ కూడా రోడ్లు వేయాలేదని, ఏ ఒక్క కడునిరుపేద కుటుంబీకులకు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదని, కనీసం ఇళ్లు మంజూరు కూడా చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ పాలకులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజాగ్రహనికి గురికావల్సివస్తుందని హెచ్చరించారు. అసలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకనైనా ఈ అధికారికయంత్రాంగ ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.