Search
Close this search box.
Search
Close this search box.

తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్టు అప్రజాస్వామికం

తిరుపతి

          తిరుపతి ( జనస్వరం ) : తిరుపతిలో జనసేన నేత శ్రీ కిరణ్ రాయల్ అరెస్టు అప్రజాస్వామికమని ఆయనను  వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు అన్నారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రంలో డాబి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఆయన విగ్రహానికి వినతిపత్రం అందజేసారు. వారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ పాలకులకు నాయకులకు బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని కోరుతూ… అదేవిధంగా జనసేన నాయకుల పైన అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేస్తే ప్రతి నియోజకవర్గం, మండలాల్లో వైసీపీ నాయకులను అడ్డుకుంటామని జనసేన తరపున హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్, మచ్చ లక్ష్మినారాయణ, రాజగోపాల్, శ్రీనివాస్ రాజు, వీరామహిళ రెడ్డిరాణి, మణికుమార్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way