బంటుమిల్లిలో జనసైనికుల అరెస్టు అప్రజాస్వామ్యం : పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు

    పెడన, (జనస్వరం) : పెడన నియోజవర్గంలోని శివారు ప్రాంతాలైన కృత్తివెన్ను, బంటుమిల్లి మండలల వైద్య అవసరాల కోసం చిన్నపాండ్రాకులో 30 పడుకుల ఆసుపత్రిని గత ప్రభుత్వ హయాంలో నిర్మించడం జరిగింది. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు సరిగా లేనందున మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలంటూ ఈ రోజు బంటుమిల్లిలో మా జనసైనికులు నిరసన దీక్షలు చేపట్టారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు మా జనసైనికుల దీక్షను భగ్నం చేసి వారిని అరెస్టు చేయడం జరిగింది. ‌ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన దీక్ష చేస్తున్న జనసైనికులను అరెస్టు చేయడాన్ని పెడన నియోజవర్గ జనసేనపార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ వి బాబు తెలిపారు. అరెస్టు చేసిన మా జనసైనికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే చిన్న పాండ్రాక ఆసుపత్రి పూర్తిస్థాయి అందుబాటులోకి రాలేదు. వైద్య సిబ్బంది కొరత వలన ప్రజలు తమకు అవసరమైన వైద్య సేవలను పొందలేకపోతున్నారు. కృత్తివెన్ను, బంటుమిల్లి మండలంలోని ప్రజలు తమ వైద్య అవసరాల కోసం సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం, గుడివాడ, భీమవరం వెళుతున్నారు. ఒక్కొక్కసారి సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వైసిపి ప్రభుత్వం వచ్చాక ప్రజా ఆరోగ్యాన్ని, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని వాపోయారు. సంబంధిత వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి చిన్న పాండ్రాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని జనసేనపార్టీ తరుపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way