Search
Close this search box.
Search
Close this search box.

‘ జనంలోకి – జనసేన ‘ అనే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన అరకు జనసేన నాయకులు

అరకు

      అరకు, (జనస్వరం) :  విశాఖ మండలం అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం కొండిబా పంచాయతీ పరిధిలో గల కపటి వలస గ్రామంలో జనసేన మాటలు జనంలోకి తీసుకెళ్లాలని భాగంగా జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, సన్యాసిరావు ఆధ్వర్యంలో బుధవారం ఆయా గ్రామంలో పర్యటించడం జరిగింది. ముందుగా గిరిజనులతో సమావేశమై జనసేన మాటలు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ సందర్భంగా సాయిబాబా, సన్యాసిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు వ్యవహరిస్తుందని, రాష్ట్రంలో రాక్షస పాలన వ్యవహరిస్తుందని దీనికై రానున్న రోజుల్లో గిరిజనులు అందరు కూడా వ్యతిరేకించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలకు సూచించారు. దీనికి ముందుగాను జనసేన పార్టీ విధి విధానాలు, రాష్ట్రంలో ప్రజలు ప్రతిపక్షం హోదాలు లేనప్పటి కూడా నిత్యం ప్రజా శ్రేయస్సే నా లక్ష్యం అంటూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపై ఎదురొడ్డి నిలబడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని, కావున ప్రతి ఒక్క గిరిజనులు జనసేన పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా గిరిజనులకు సూచించారు. ప్రభుత్వాలు మారిన గిరిజనుల బతుకులు మారలేదని, రానున్న రోజుల్లో పాలకులకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని, దానికి  మీరు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రామచందర్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way