గులాబ్ తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అరకు జనసేన నాయకులు

అరకు

      అరకు, (జనస్వరం) : గులాబ్ తుఫాను బాధితులకు బియ్యం పంపిణీ చేసిన జనసేన నాయకులు మాజీ ఎం పి టి సి సాయిబాబా, దూరియా, ch.మురళి, విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన అరకు నియోజకవర్గం పరిధిలో గల అనంతగిరి మండలం రేగుశోభ పంచాయతీ పరిధిలోగల, హేక్టగుడా గ్రామంలో మంగళవారం జనసేన పార్టీ జన సైనికుడు Ex ఎం పి టి సి సాయిబాబా, డూరియా, జడ్పిటిసి అభ్యర్థి సిహెచ్ మురళి ఆధ్వర్యంలో ముందుగా  తుఫాన్ వల్ల ఇల్లు నష్టపోయిన బాధితురాలు ఇంటి వద్దకు వెళ్లి, పరామర్శిస్తూ, వారికి భరోసానిస్తూ బాధితులకు ఉచితంగా బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. అనంతరం రోజువారీగా కూలి పనులు చేసుకుంటూ బతికే గిరిజనులు, మూడు రోజుల నుంచి గులాబ్ తుఫాన్ వల్ల కూలికి వెళ్లలేక, పూట గడవని పరిస్థితిలో ఉన్న గిరిజన బాధితులకు, జనసేన ఆధ్వర్యంలో వారి ఇంటి వద్దకు వెళ్లి, ప్రతి ఒక్క బాధితులకు డోర్ డెలివరీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ, రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు నేడు మీ గ్రామంలో పర్యటించడం జరిగిందని, జనసేన పార్టీ జనం కోసమే పుట్టిందని నీకోసం, అందరికోసం జనసేన పార్టీ ముందుకు ఉంటుందని గిరిజనులతో సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసైనికులు, రామారావు, సురేష్, అధిక సంఖ్యలో గిరిజనులు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way