Logo
Date of Publish : 18 September 2021, 1:03 pm
Editor : Sake Naresh

ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న ఏపీ ప్రభుత్వం : చిత్తూరు జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి కీర్తన

        తిరుపతి ( జనస్వరం ) : ప్రజలు కరోనా ప్రభావంతో ఆర్ధికంగా చితికి పోయి, అతి కష్టం మీద బతుకుబండిని లాగుతున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొద్దిగా మెరుగుపడుతోందని చిత్తూరు జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి కీర్తన అన్నారు. ఆమె పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఈ స్థితిలో ప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాలని అలా కాక, ఏపీ ప్రభుత్వం ట్రూఅప్ చార్జీల పేరుతో కరెంట్ బిల్లు పెంచి పెను భారం మోపింది. గత నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ సంస్థకి నష్టాలు వచ్చాయని, ఆ నష్టాలను ప్రజల నుంచే వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, వసూళ్ళకు పూనుకోవడం హేయమైన చర్య. ప్రతి యూనిట్ పైన రూ.1.23 అదనపు భారం, 8 నెలల పాటు వేయబోతున్నారు. దీని వలన సామాన్యులకి, మధ్య తరగతి ప్రజలపై విపరీతంగా భారం పడింది. గతంలో అధిక ఛార్జీలు, డిస్కంలు, పంపిణీ సంస్థలకు అయ్యే అదనపు ఖర్చుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. అలా కాక ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపై వేయడం భావ్యం కాదు. మరియు ప్రజలు చెల్లించే స్థితిలో లేరు. కావున తక్షణమే పెంచిన ట్రూ అప్ ఛార్జీలను ఉపసంహరించి నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com