Search
Close this search box.
Search
Close this search box.

సర్వేపల్లి నియోజకవర్గంలో మరో ఉద్దానం..?

సర్వేపల్లి

      సర్వేపల్లి ( జనస్వరం ) : వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీ నందు కొండ కింద ఎస్టి కాలనీ నందు మంగళవారం పర్యటించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. జనం కోసం జనసేన 35వ రోజు కసుమూరు పంచాయతీలోని కొండ కింద పల్లి నందు వైసిపి వైఫల్యాలను గడపగడపకు తెలియజేస్తూ కొనసాగించచారు. అందులో భాగంగా అనేక సమస్యలు వారి దృష్టికి స్థానికులు తీసుకురావడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం కసుమూరు పంచాయతీ పరిధిలోని కొండ కింద ST కాలనీ నందు నివాసం ఉంటున్న ప్రజలు కిడ్నీ వ్యాధితో ఎంతోమంది ఇబ్బందులు పడుతూ కనీసం ఇప్పటివరకు కిడ్నీ వ్యాధితో 6 మంది చనిపోవడం జరిగింది. ఈ కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణం తాగునీటి సమస్య బోరు ద్వారా వచ్చే కొళాయి నీళ్లు తాగడం వలన కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని చెప్పి అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. ఇక్కడకు వచ్చి చూస్తే మరో ఉద్దాన౦ లాగా సమస్య ఉంది అనిపిస్తుంది. ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఈ వెంకటాచలం మండలంలో కసుమూరు పంచాయతీ నందు ఆయన గడపగడపకు తిరిగాడు కానీ ఇక్కడ ST కాలనీ నందు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి సమస్యలు ఆయనకు పట్టవా ? కిడ్నీ వ్యాధితో కుటుంబ యజమానులు చనిపోతే ఆ కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. భర్త చనిపోయిన మహిళలకి కనీసం పెన్షన్ కూడా రాసిన పరిస్థితులు లేవు. 15 రోజుల లోపల వీళ్ళకి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే దానికి ముందుకు వెళ్తారా లేదంటే జనసేన పార్టీ వాళ్లకి తాగడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయమంటారా ? అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, మండల ప్రధాన కార్యదర్శి కాకి శివ, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సుమన్, సాయి, స్థానికులు మస్తాన్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way