Search
Close this search box.
Search
Close this search box.

నా సేన కోసం – నా వంతు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దారం అనిత

    మదనపల్లి, (జనస్వరం) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నా సేనకోసం నా వంతు అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని అనిత తెలిపారు. తాము పార్టీకి తమకు తోచినంత సహాయాన్ని అందించి ఈ యొక్క విషయాన్ని తమ బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి స్నేహితులకు తెలియజేసి మరింత మందిని పార్టీకి అనుసంధానం చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా ప్రతి మండలంలోనూ పంచాయతీల వారీగా మండల కమిటీ సభ్యులకు ఏ విధంగా ఈ యొక్క నాసేనకు నా వంతు అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకో వెళ్లాలి అనే అంశాల మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా క్రియా మెంబర్షిప్ చేసుకున్న అందరు దయచేసి అస్త్ర యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తద్వారా పార్టీ తరఫున జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం ఈ యొక్క యాప్ ద్వారా తెలుసుకోవచ్చు యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఉపయోగించాలి అనే అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు హరి, ముని, ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way