Search
Close this search box.
Search
Close this search box.

అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ వారికి అండగా ఉంటాం

   చిట్వేలు ( జనస్వరం ) :  రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిది రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ వారు చేపడుతున్న రిలే నిరసన దీక్షకు మద్దతుగా బుధవారం జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అధినేత పవన్ కళ్యాణ్  ఆదేశాల మేరకు జనసేన పార్టీ చిట్వేలి మండల నాయకులు మాదాసు నరసింహ అధ్వర్యంలో అంగన్వాడి వారు చేపడుతున్న నిరసనలో పాల్గొని తమ మద్దతు తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ తాలూకా న్యాయమైన కోర్కెలకు తమ మద్దతు తెలిపి వెంటనే వారికి రావాల్సిన బకాయులను తీర్చాలని, ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో తాను ప్రతిపక్ష నేతగా ఉండగా ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు ఏదైతే గౌరవ వేతనంగా 26 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ యొక్క హామీని నెరవేర్చాలని కోరారు. గతంలో కూడా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం మీకు పెంచుతామని చెప్పి మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలను విస్మరించి మాట తిప్పారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదాసు నరసింహ, షేక్ రియాజ్ కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివమాదాసు శివ, సుభాష్ చంద్రబోస్, పసల శివ పురం గోపాల్, ఆనందల తేజ, కడుమురి సుబ్రమణ్యం, నీలి కృష్ణ, దండుదినేష్, హేమంత్ రెడ్డి, మౌలానా తదితరుల పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way