అంధకారంలో ఆంధ్రప్రదేశ్ : తిరుపతి జనసేనపార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్

● రోడ్లు, కరెంటు, నీరు లేక ఏపీలో నరకం, పదోతరగతి పబ్లిక్ పరీక్షల విద్యార్థులకు కష్టాలు

● తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నాం కిరణ్ రాయల్
●మన రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశారని తిరుపతి జనసేనపార్టీ ఆగ్రహం

     తిరుపతి, (జనస్వరం) : వైసీపీ ప్రభుత్వం (దోపిడి రాజ్యం) వచ్చాక మన ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు, కరెంటు, నీరు లేక ప్రజలు నరకాన్ని అనుభవిస్తున్నారని, ఈ పరిస్థితిని చూసి పక్క రాష్ట్రాల వారు మనపై జాలిపడి, నవ్వుకుంటున్నారని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ విమర్శించారు. ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియాసమావేశంలో మీడియాతో జనసేన నాయకులు రాజా రెడ్డి, డా. బాబు, బాబ్జి, సుమన్ బాబు, మునిస్వామి, బలరాం, మనోజ్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ మంత్రి సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ మన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, దయనీయస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ కొట్టుమిట్టాడుతోందని చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కరోనా(లాక్ డౌన్) 3 సంవత్సరాల కాలం పాటూ పాఠశాలలు సరిగా నిర్వహించక పోవడంతో విద్యార్థులు నష్టపోయారని, అలాంటి పరిస్థితులలో ఈ సారి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కరెంటు కోతతో ఇబ్బందులు పడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక రోడ్లు అధ్వానంగా తయారైతే, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జనసేన ఆధ్వర్యంలో బిచ్చమెత్తి రోడ్లు వేయించామని గతాన్ని గుర్తు చేశారు. ఈ వేసవి తాపంతో సామాన్యులు కష్టాలు పడుతుంటే తాగడానికి నీరు కూడా సరఫరా చేయని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షల పేపర్ లీక్ అయితే సంబంధిత వారి పేర్లను బహిర్గతం చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ చేతగాని సీఎం జగన్ పరిపాలన ఇంకెన్నాళ్లు అని ప్రజలు బాధపడుతున్నారన్నారు. చేతగాని వైసీపీ ప్రభుత్వం గద్దె దిగితే రాష్ట్రం బాగుపడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేక ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆకలి మంటలు అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way