పెట్రోలు, డీజిల్ ధరల పట్ల స్పందించని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం : ఆత్మకూరు జనసేనపార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

    ఆత్మకూరు, (జనస్వరం) : ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలకు సంబంధించిన విషయమై ఆత్మకూరు జనసేనపార్టీ కార్యాలయంలో, నియోజకవర్గ జనసేన నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో ప్రజలు పడుతున్న బాధలను గుర్తించిన శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, పెట్రోలుపై ₹5, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించిన విషయం మనకందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన బాటనే అనుసరిస్తూ, అస్సాం, త్రిపుర, కర్ణాటక, మణిపూర్, గుజరాత్, గోవా తదితర రాష్ట్రాలు ఏడు రూపాయల వంతున ఒరిస్సా మూడు రూపాయల వంతున తమ రాష్ట్ర ప్రభుత్వ వాటా గా తగ్గించడం జరిగింది. ప్రజలపై పడుతున్న భారాన్ని గుర్తించి ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినప్పటికీ, మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎంతో శోచనీయం. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రప్రభుత్వం రోడ్డు సెస్ పేరుతో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపై మోపడం జరిగింది. ఇప్పటికైనా మిగిలిన రాష్ట్రాల బాటలోనే, మన రాష్ట్రం కూడా పెట్రోలు, డీజిల్ పై పన్నులు తగ్గిస్తూ, ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవాలని, జనసేనపార్టీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో పెట్రోలు, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించే వరకు ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way