ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా అనంతగిరి మండలం జనసేన నాయకులు

అనంతగిరి

    అనంతగిరి, (జనస్వరం) : ఉద్యోగుల ఆందోళనలకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని అనంతగిరి మండల జనసేన అధ్యక్షులు సిహెచ్ మురళి. పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఖండించారు. సీఎం పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పిఆర్సి అర్ధాన్ని మార్చి వేశారు. ఉద్యోగుల పరిమితి పెంచమని వారు ఏనాడూ అడగ లేదన్నారు. పదవి వీర మరణ పొందిన వారికి 20 లక్షల నుండి 70 లక్షల వరకు పేమెంట్ చేయాలన్నారు. దాని నుండి తప్పించుకోవడానికి ఈ పెంపు అని అన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువత తమ అవకాశాలను పోగొట్టుకుంటున్నారు 7 డి ఎల్ లు బాకీ ఉన్న ప్రభుత్వాన్ని ఏనాడూ చూడలేదని, అది ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకి ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగ సంఘాలను ఆదుకోవాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సింహాద్రి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way