రజక కాలనీ ముంపు ప్రాంతంలో పర్యటించిన అనంతపురం జనసేన నాయకులు

     అనంతపురం, (జనస్వరం) : ఒక మోస్తారు వర్షానికే అనంతపురం నియోజకవర్గంలో సోమనాథ్ నగర్ లోని రజక కాలనీ నీట మునిగింది. గత రెండు రోజులుగా కనీసం అధికారుల పర్యవేక్షణ లేకుండా కాలనీవాసులు అయోమయ దీన పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం తెలిసి జనసేనపార్టీ పర్యవేక్షణలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో నీట మునిగిన కాలనీవాసుల్ని పరామర్శించి, మీకు అండగా జనసేనపార్టీ ఉంది అని కాలనీవాసులలో మనోధైర్యాన్ని నింపి, మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే జనసేనపార్టీ అధికారంలోకి రావాలని జనసేనపార్టీ ఆవశ్యకతను తెలియజేసి, కాలనీ వాసులకు భరోసా కల్పించడం జరిగింది. తక్షణమే అనంత నగర కార్పొరేషన్ అధికారులు స్పందించి ముంపు ప్రాంతానికి గురైన రజక కాలనీ వాసుల్ని ఆదుకోవాలని జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, లాయర్ మధు, నగర కార్యదర్శిలు విశ్వనాధ్, రమణ, లాల్ స్వామి నగర సంయుక్త కార్యదర్శులు ఆకుల అశోక్, కార్యక్రమాల కమిటీ కార్యదర్శి సంతోష్, జనసేన నాయకులు పాలగిరి చరణ్ , మెరుగు శ్రీనివాసులు, భవాని నగర్ మంజునాథ్, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way