ఫుడ్ పాయిజన్ అయిన శింగనమల కేజీబీవీ (KGBV) విద్యార్థినిలను హాస్పిటల్లో పరామర్శించిన అనంతపురం జనసేన నాయకులు

• విద్యార్థినీలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

• శింగనమల కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

    శింగనమల, (జనస్వరం) : శింగనమల మండల కేంద్రములోని కస్తూరిభాయి స్కూలు నందు పుడ్ పాయిజన్ గురై నదాదాపుగా 44 మంది విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు చాలా ఇబ్బంది పడుతున్న వారిని జనసేనపార్టీ నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కుమ్మర నాగేంద్ర వారిని పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడూతూ సాయంత్రము 4 గంటల నుండి విద్యార్థులు, కడుపునోప్పి, వాంతులు, విరేచనాలుతో ఇబ్బంది పడుతుంటే దాదాపుగా 8 గంటల పైన విద్యార్థులను స్కూలు HO హస్పిటల్ కు జాయిన్ చేయడము ఇంత నిర్లక్ష్యమా… కావున పుడ్ పాయిన్ కు కారణము అయిన వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చరవాణిలో జిల్లా DEO దృష్టీకి తీసుకెళ్ళడము జరిగింది. ఆయన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడము జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook