Search
Close this search box.
Search
Close this search box.

అనంతపురం : పోలీసుల తోపులాటలో దెబ్బలు తగిలిన జనసైనికుడిని పరామర్శించిన జనసేన నాయకులు

అనంతపురం

           అనంతపురం ( జనస్వరం ) : విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించడానికి వస్తుంటే కార్యాలయం లోపలికి వెళ్లనివ్వకుండా బయటే పోలీసుల తోపులాటలో దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైన జనసేన పార్టీ కార్యకర్త రామకృష్ణను పరామర్శించారు. రామకృష్ణకు ధైర్యం చెప్పి మేమందరం ఉన్నామని జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, కదిరి ఇంచార్జ్  భైరవ ప్రసాద్, హిందూపురం ఇంచార్జ్ ఆకుల ఉమేష్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్,  రామాంజనేయులు, నాగేంద్ర, నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way