Search
Close this search box.
Search
Close this search box.

భారీ వర్షాల వలన ఇల్లు కోల్పోయిన బాధితుడికి ఆర్ధిక సాయం అందించిన అనంతపురం జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ

      గుంతకల్లు, (జనస్వరం) : గుంతకల్ పట్టణం స్థానిక శ్రీలంక కాలనీలో నివాసం ఉంటున్న జనసైనికుడు లారెన్స్ కొట్టం భారీ వర్షం కారణంగా కూలిపోయింది విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ వెళ్లి పరామర్శించి అండగా 5000 ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికుల దగ్గర సంఘటన ఎలా జరిగిందని ఆరా తీయగా కాలనీ వాసులు ఎన్నో ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మాత్రం మారడం లేదు అని, కేవలం మమ్మల్ని ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేయించుకునేటప్పుడు మాత్రమే మా దగ్గరికి వస్తారు ఆ తర్వాత మా సమస్యలను ఎవరూ పట్టించుకోరు ఎప్పుడో 1982లో నిర్మించుకున్న మట్టి ఇళ్లలోనే మేము ఇప్పటికీ నివాసముంటున్నాము, ఏ ప్రభుత్వంలోనూ మాకు పక్కా ఇల్లులు మంజూరు కాలేదు, రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకుంటే ప్రమాదాన్ని ఊహించుకోవడానికి భయమేస్తుందని వాపోయారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు మమ్మల్ని మనుషులుగా గుర్తించి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. స్థానికులతో వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ఈ ఘటనపై సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి సాయం అందేలా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుందని భవిష్యత్తులో కూడా శ్రీలంక కాలనీలో నివాసం ఉంటున్న 35 కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించే వరకు జనసేనపార్టీ అండగా ఉంటూ న్యాయ పోరాటం చేస్తుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, ఆటో రామకృష్ణ, మంజునాథ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way