పెనుకొండ, (జనస్వరం) : మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని జనసేన పార్టీ తరపున13వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన వీరమహిళ శ్రీమతి శ్రీదేవి ప్రమాదవశాత్తూ గాయపడడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ ఫోన్ ద్వారా పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకొని 10,000/- వేల రూపాయలు ఆర్థికసాయం అందించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ గారి తరపున జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య 10,000/- రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శిలు సిద్దు, శివ, జిల్లా నాయకులు వెంకట్ నారాయణ, పవనిజం రాజు, వీరమహిళలు చంద్రకళ, రూప, గీత, నాయకులు లోకేష్, విష్ణు, శివ శంకర్, రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com