క్రియా శీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ.టి.సి.వరుణ్

అనంతపురం

         అనంతపురం, (జనస్వరం) :  జనసేన పార్టీ  జిల్లా కార్యాలయంలో  పూర్తయిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు ను జిల్లా అధ్యక్షులు శ్రీ.టి.సి.వరుణ్ గారు  సమక్షంలో క్రియశీలక సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు సిటీలో దాదాపు 1100 మంది పైచిలుకుతో పూర్తి చేయటం శుభప్రదం అని ఆయన  తెలిపారు. తన వ్యక్తిగత సంపాదన నుంచి కార్యకర్తల శ్రేయస్సు నిమిత్తం కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే అనీ, ఈ సభ్యత్వంతో పాటు సభ్యులకు ఇచ్చిన భీమాసౌకర్యంతో ప్రమాదం జరినపుడు, వైద్యం నిమిత్తం రూ50000లు ప్రాణహాని జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు రూ 500000 ఇస్తూ పార్టీ తరపున భరోసా కల్పిస్తున్నామని, దేశంలో మరే రాజకీయ పార్టీల్లో లేని సౌకర్యం జనసేన పార్టీ కలగజేసింది. రానున్న రోజుల్లో అన్నీ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వాలు పూర్తి చేసి బలమైన కమిటీలు ఏర్పరుచుకొని, కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల ఆర్థిక కష్టాలను సైతంలెక్క చేయక పన్నులతో బాదుతూ పీడిస్తున్న ప్రభుత్వంతో పోరాటానికి సామాన్యుడికి అండగా నిలుస్తామనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసైనికులు మరియు ముఖ్య నాయకులు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way