ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా పనిచేయాలి శ్రేణులకు అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టిసి.వరుణ్‌ దిశానిర్దేశం

       అనంతపురం, (జనస్వరం)  :  జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి  ఆశయాలు, ఆలోచనలను క్షేత్రస్థాయిలోకితీసుకెళ్లి ప్రభుత్య వైఫల్యాలే అస్త్రంగా వేనిచేస్తూ పార్టీని పటిష్టం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు టి‌సి. వరుణ్ గారు నూతన సభ్యులకు దిశానిర్దేశం చేశారు.  స్థానిక రామ్‌నగర్‌లోని ఆకాష్‌మల్లన్న కార్యాలయంలో జనసేన పార్టీ జిల్లా తొలి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి, జనసేనకార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి భవాని రవికుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగాచిలకం మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, అనంత జిల్లాలో అధికార పార్టీ అరాచకాలు అధికమయ్యాయన్నారు. ప్రజా సొమ్ముతో అమలు చేస్తున్న సంక్షేమ వథకాల నిర్వహణలో పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో జనసేన నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు వేళూసుకుపోయిన సమన్యలపై పోరాటాలు చేసేందుకురాష్ట్ర అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనసేన జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్‌ మాట్లాడుతూ, ఎక్కడికక్కడ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతునే ప్రజలకు జనసేన అండగా ఉందన్న భరోసా ఇవ్వాలన్నారు. కార్యకమంలో ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్,  పత్తి చంద్రశేఖర్‌, కే.నాగేంద్ర, దాసరి రామాంజనేయులు, కార్యదర్శులు రాపా ధనుంజయ, ఇండ్ల కిరణ్‌కుమార్‌, గౌతం, లహరి చొప్ప చంద్రశేఖర్‌, మణికంఠ, రమణ, వి.సురేష్‌, సంజీవ రాయుడు, కోన చంద్రశేఖర్‌, లక్ష్మీనరసయ్య, సిద్దు, సంయుక్త కార్యదర్శులు, కదిరి ఇంఛార్జ్ భైరవ ప్రసాద్‌, హిందూపురం ఇంఛార్జ్ ఆకుల ఉమేష్‌, రాప్తాడు ఇంఛార్జ్ సాకే పవన్‌కుమార్‌, మహిళా నాయకురాలు పచ్చబొట్ల పద్మా, రూప తదితరులు పాల్గొన్నారు.