ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు వెంటనే పరిహారం అందించాలి : అనంతపురం జిల్లా జనసేన నాయకులు

       అనంతపురం, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు T.C వరుణ్ గ్రీవెన్స్ లో అనంతపురం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లాకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ 1 లక్ష రూపాయలు సహాయం చేసిన కౌలు రైతులను వారు కౌలు రైతులే కాదని రైతులను అవమానించే విధంగా మాట్లాడారు. తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే అనంతపురం జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తప్పకుండా అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఇంచార్జ్ ఆకుల ఉమేష్, రాప్తాడు ఇంచార్జ్ పవన్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భవాని రవికుమార్, రాయలసీమ ప్రాంతీయ మహిళ కమిటీ సభ్యులు శ్రీలత, పసుపులేటి పద్మావతి, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్ లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way