Search
Close this search box.
Search
Close this search box.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం

•  ధర్మాజీగూడెం వద్ద రోడ్డును తవ్వేస్తున్న వైనం
• అడ్డుకున్న జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ 

        పశ్చిమగోదావరి, (జనస్వరం) : జనసేన పార్టీ కౌలురైతు భరోసాయాత్రలో భాగంగా – బలవన్మరణాలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించేందుకు శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి రానున్న నేపథ్యంలో యాత్రను అడ్డుకునేందుకు, ఆటంకాలు కలిగించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. చింతలపూడి నియోజకవర్గం, ధర్మాజీగూడెం వద్ద ఆర్ అండ్ బి రహదారిని అడ్డంగా తవ్వించేస్తున్నారు. ఉన్నపళంగా జేసీబీతో రోడ్డుని తవ్విస్తుండడాన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. చింతలపూడిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తూ మార్గం మధ్యలో రోడ్డు తవ్వుతున్న దృశ్యాలు చూసిన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహర్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు జేసీబీని అడ్డుకున్నారు. రహదారి పనుల ముసుగులో పవన్ కళ్యాణ్  యాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way