Logo
Date of Publish : 06 April 2022, 5:38 pm
Editor : Sake Naresh

విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ అంతరాయంపై ధర్నా చేసిన ఆముదాలవలస జనసైనికులు

      ఆముదాలవలస ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం కొల్లివలస జంక్షన్ లో శ్రీ కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు మరియు ఎంపీటీసి అంపిలి విక్రమ్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు మరయూ విద్యుత్ అంతరాయం పై ధర్నా చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు, వ్యాపారస్తులు మరియు మద్య తరగతి కుటుంబాలు విద్యుత్ అంతరాయంపై చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. గన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచి పేదవాళ్లపై పెనుబారం మోపుతుందని, ఇప్పటికే కరోనా విపత్తువలన అన్ని వర్గాల ప్రజల ఆదాయాలపై పెనుబారం పడిందన్నారు. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశానికి అంటాయని, ఇప్పుడు మరలా విద్యుత్ చార్జీలు పెంచితే పేదవారు జీవించేది ఎలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జైరాం, సంగం నాయుడు, సంతోష్ జనసేన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com