Search
Close this search box.
Search
Close this search box.

మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మర్రిపాడు

      ఆత్మకూరు ( జనస్వరం ) : భారత రాజ్యాంగ నిర్మాత. భారతరత్న శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మర్రిపాడు మండల కేంద్రంలో లోని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పిస్తూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన అశయాలను ముందుకు తీసుకెళ్తామని మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఒరుగంటి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశం నిలవడానికి ప్రధాన కారకులు అంబేద్కర్ అని బడుగు బలహీన వర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోదుడన్నారు. ప్రభుత్వ ఫలాలందరికి చెందాలని, సామాజికంగా, ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించడంతో నేటికీ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నా జనసేన స్థానిక ప్రజలు కార్తిక్, వెంకటేష్, నాగయ్య, తదితరులు నివాళులర్పించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way