జగన్ రెడ్డి పాలలో అన్నివ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి

జగన్ రెడ్డి

        ఒంగోలు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్సూచన మేరకు ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 39వ రోజు ఒంగోలులోని 24వ డివిజన్ కొత్త మార్కెట్ లో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు తో మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి పాలన లో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని వ్యాపారాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారం వాపోయారు. కనీసం మార్కెట్లో కల్పించవలసిన మౌలిక వసతులు కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారు కల్పించలేదని, అలానే యువత మాట్లాడుతూ ఈసారి మా యువత అంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని, ఆడబిడ్డలు మాట్లాడుతూ పవన్ అన్నకే మా మద్దతు అనీ అన్నారు. ఇలా జగన్ రెడ్డి పోవాలి పవన్ అన్న రావాలి నినాదంతో జనచైతన్య యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్ల ప్రమీల, అనిల్ దండే, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు పోకల హనుమంతు రావు, ఆకుపాటి ఉష, 2వ డివిజన్ అధ్యక్షురాలు నూకల బ్రహ్మనాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, మరియు జనసేన నాయకులు అరవింద్ బాబు ముత్యాల, బాయ్రెడ్డి వేణు, జనసేవ శ్రీనివాస్, నరసింహారావు, చెన్ను నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way