సర్వరంగ సమగ్ర అభివృద్ధి జనసేనకే సాధ్యం : డాక్టర్ యుగంధర్ పిలుపు

జనసేన

        గంగాధర్ నెల్లూరు ( జనస్వరం ) : పెనుమూరు మండలం తెలివి రెడ్డిపల్లి పంచాయితీ మలిరెడ్డిపల్లి గ్రామంలో చాలా సంవత్సరాలుగా రోడ్డు విరువైపులా ముళ్ళ చెట్లు పొదలు నిండుకొని ఉన్న ప్రాంతాన్ని నియోజకవర్గ ఇన్చార్జి సందర్శించారు. మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో చెరువు కట్టమీద ఉన్న రోడ్డు కి ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను జేసిబితో తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా యుగంధర్ పొన్న మాట్లాడుతూ సర్వరంగ సమగ్ర అభివృద్ధి గ్రామాల్లో జరగాలంటే పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టాలని ఉద్బోధించారు. గ్రామీణ రహదారులు లేనిదే అభివృద్ధి లేదని తెలిపారు. మల్రెడ్డిపల్లి వాసులకు అండగా జనసేన ఉంటుందని, జనసేన సేవకే గాని సంపాదనకు కాదని ప్రతి కార్యక్రమంలో నిరూపితమవుతుందని తెలిపారు. మెకానిజం ఉండి మెల్కోని అధికార యంత్రాంగం ఉందని, ఓటు బ్యాంకు ఉన్న ఓటు బ్యాంకు లేకపోయినా అభివృద్ధికి అభివృద్ధి అందరికీ సమానమేనని ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మన బాట పేరిట సహాయం అందిస్తామని, ఎవరైనా రోడ్డు సౌకర్యం లేని ప్రజలు ఉంటే జనసేన దృష్టికి తీసుకురావాలని, చేతనైనంత సహాయం చేయటానికి జనసేన ఎప్పుడు వెనకడుగు వేయబోదని, నియోజకవర్గం ప్రజలకు డాక్టర్ యుగంధ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షులు బాలాజీ, రేణుక, సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండల బూత్ కమిటీ కన్వీనర్ అన్నామలై, సంయుక్త కార్యదర్శిలు రాజు శేఖర్ నాగేంద్ర ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way