మండపేటలో అఖిలపక్షం సమావేశం, జనసేనపార్టీ సంపూర్ణ మద్దతు

జనసేనపార్టీ

     తూర్పు గోదావరి ( జనస్వరం ) : మండపేట నియోజకవర్గన్ని నూతనంగా రాజమహేంద్రవరంగా ఏర్పడే తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం స్థానిక రైస్ మిల్లర్లు అసోసియేషన్ హాల్లో అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా రాజమహేంద్రవరం జిల్లాలో మండపేట ఉండాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రజల మౌలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల పునర్విభజన చేయాలన్నారు. ఇప్పటికే మండపేట నియోజకవర్గనికి సంబంధించిన అంశాలన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళమన్నారు. ఆయన తక్షణమే స్పందించి జిల్లాల పునర్విభజన ప్రక్రియలో అన్ని నియోజకవర్గాల ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు, ఈ ఉద్యమానికి బాసటగా నిలుస్తోందని స్పష్టం చేశారు. అనంతరం వివిధ పార్టీలు నాయకులు, సంఘాల నాయకులు, తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way