జగనన్న కాలనీలంటే ఆలమూరు ఒకటే కాదు మంత్రి జోగి రమేష్ గారు : అంకె ఈశ్వర్

జోగి రమేష్

       అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అనంత పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆలమూరు జగనన్న కాలనీ మినహా మరొక కాలనీలో పర్యటించలేదు. నగర సమీపంలోని కొడిమి, ఉప్పరపల్లి, బుక్కరాయసముద్రం, చిన్మయ నగర్ కాలనీల పరిస్థితి ఏమిటో మంత్రి జోగి రమేష్ సమాధానం చెప్పి తీరాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంత్రి జోగి రమేష్ గృహ నిర్మాణాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జనసేన డిమాండ్ చేస్తుంటే.. అందుకు సమాధానం చెప్పేందుకు చేతకాక ప్రజల దృష్టిని మరలచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ ఆధ్వర్యంలో ప్రతి గృహ లబ్ధిదారునికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందని ఈశ్వర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way