పునరావాసానికి ఏళ్లు గడుస్తున్నా నిర్వాసితులకు న్యాయం జరగలేదు : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

     చిత్తూరు, (జనస్వరం) : హంద్రీనీవా కాలువకు శ్రీనివాసపురం, తాడేపల్లి జలాశయాలతో పాటు గుంటి వారి పల్లె, మదనపల్లె మండలంలో నిర్మించిన కాలువ వల్ల నివాసాలు కోల్పోయిన నిర్వాసితులు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గుంటి వారి పల్లె గ్రామాలకు చెందిన 33 మంది నిర్వాసితులు 2012 నుండి తమకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. వీరికి 4.50 కోట్లతో అన్ని వసతులు కల్పించాల్సి ఉండగా ఇంత వరకు వీరికి ఎలాంటి సాయం అందలేదు, కల్పించలేదు. దీనిని సాధించుకోవడానికి నిర్వాసితులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే అధికారులు మాత్రం వీరికి ఈ ప్యాకేజీ మంజూరు కాలేదని చెబుతుండగా మంజూరైనట్లు తమ వద్ద ఉన్నాయని నిర్వాసితులు చెబుతున్నారు. వేసవి జలాశయం నిర్మాణంలో గుత్తి వారి పల్లి ముంపునకు గురవుతుందని ఇళ్లను ఖాళీ చేసి వెళ్తే ఆర్ అండ్ బి ప్యాకేజీ కింద అన్ని వసతులతో ఇళ్లు కట్టిస్తామని అధికారులు చెప్పారు. దీనికి సంబంధిం శ్వేత పత్రం కూడా ఇచ్చారు. ఆర్ అండ్ బి ఆర్ ప్యాకేజీ కింద అమలు చేయాలని 2012 నుండి నిర్వాసితులు పోరాడుతున్నారు. పలుసార్లు అధికారులకు అర్జీలు ఇచ్చిన న్యాయం జరగలేదని నిర్వాసితులు వాపోతున్నారు. వెంటనే వీరికి న్యాయం జరగాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way