Search
Close this search box.
Search
Close this search box.

సరైన గిట్టుబాటు ధర లేక ఎంతోమంది రైతుల ఇబ్బందులు

రైతు

       సర్వేపల్లి ( జనస్వరం ) : జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో ఎక్కువ శాతం నిమ్మ పండించే రైతులు అయితే నిమ్మ రైతులందరూ కూడా సరైన గిట్టుబాటు ధర లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైతులను అన్ని విధాలు ఆడుకుంటున్నారు. అన్ని పంటలు పండించిన దానికి గిట్టుబాటు ధర అందిస్తున్నామని మాటలతో మభ్యపెడుతూ, వాగ్దానాలు చేస్తున్నారే తప్ప రైతులను నట్టేట ముంచుతున్నారు. మరి మంత్రి సొంత మండలంలోని రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. ఈ విషయం ఆయనకు తెలియదా ప్రభుత్వాన్ని చేతులు జోడించి ఒక్కటే కోరుతున్నాను. రైతులను ఆదుకోండి. రాబోయేది జనసేన ప్రభుత్వమే, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతులకు అండగా ఉండేది జనసేన పార్టీ మాత్రమే. ఈ కార్యక్రమంలో మండల అధయక్షుడు అనిల్, స్థానిక నాయకులు సంజు, శ్రీహరి, ఖాజా ,వంశి, పవన్, కార్తీక్,y. పవన్, జాన్, ప్రసాద్, వేణు, వంశీ, సురేష్, అశోక్, కల్యాణ్, హరి, హరీష్, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way